* 1,363 పోస్టులకు దరఖాస్తు చివరి తేది: ఫిబ్రవరి 23
తెలంగాణలో గ్రూప్-3 సర్వీసు ఉద్యోగాలకు గతేడాది డిసెంబర్లో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. 26 ప్రభుత్వ విభాగాల్లో మొత్తం 1,363 పోస్టులు నోటిఫికేషన్ ఇవ్వగా.. దరఖాస్తుల పక్రియ జనవరి 24 నుంచే మొదలైంది. వీటిలో అత్యధిక ఉద్యోగాలు ఆర్థికశాఖలో ఉన్నాయి. గ్రూప్ 3 ఉద్యోగాలకు ఫిబ్రవరి 23 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు టీఎస్పీఎస్సీ తాజాగా విడుదల చేసిన సమగ్ర నోటిఫికేషన్లో పేర్కొంది.
గ్రూప్ 3 ఉద్యోగాలకు విద్యార్హతలు, వయో పరిమితి, వేతన స్కేలు, రిజర్వేషన్లు తదితర వివరాలతో పాటు పరీక్ష సిలబస్ను నోటిఫికేషన్లో పొందుపరిచింది. ఆబ్జెక్టివ్ రూపంలో ఉండే ఈ పరీక్షను జులై లేదా ఆగస్టు నెలలో నిర్వహించే అవకాశం ఉన్నట్టు టీఎస్పీఎస్సీ పేర్కొంది. అయితే, ఈ పరీక్ష కంప్యూటర్ ఆధారితంగా నిర్వహిస్తారా లేదా ఆఫ్లైన్లోనా అనేది అధికారులు స్పష్టం చేయలేదు. పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకొనే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థులు చివరి నిమిషం వరకు వేచిచూసే ధోరణితో కాకుండా ముందుగానే దరఖాస్తు చేసుకుంటే మంచిదని సూచించింది.
టీఎస్పీఎస్సీ > గ్రూప్-1 > స్టడీమెటీరియల్
‣ వర్తమానాంశాలు – ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ అంశాలు
‣ అంతర్జాతీయ సంబంధాలు, సంఘటనలు
‣ జనరల్ సైన్స్ – శాస్త్ర, సాంకేతిక రంగాల్లో భారత దేశం సాధించిన విజయాలు
‣ పర్యావరణ అంశాలు – విపత్తు నిర్వహణ – నివారణ, ఉపశమనం కోసం వ్యూహాలు
‣ భారతదేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధి
‣ ప్రపంచ భూగోళ శాస్త్రం, భారత భూగోళ శాస్త్రం, తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం
‣ భారత దేశ చరిత్ర, సంస్కృతి – వారసత్వం