* ఎన్టీఏ వెల్లడి
దిల్లీ: వెయ్యి మందికి పైగా అభ్యర్థులకు జులై 19న మరోసారి సీయూఈటీ - యూజీ పరీక్షను నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్ణయించింది. ఈ మేరకు జులై 14న నోటిఫికేషన్ విడుదల చేసింది. పరీక్ష కేంద్రంలో తొలుత తాము ఎంపిక చేసుకోని భాషలో ప్రశ్నపత్రాలు పంపిణీ చేశారని, ఆ తర్వాత వాటిని వెనక్కి తీసుకొని సరైనవి ఇచ్చారని, దీనివల్ల సమయం వృథా అయిందంటూ కొందరు అభ్యర్థుల నుంచి ఫిర్యాదులు వచ్చినట్లు ఎన్టీఏ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో వారికి మరోసారి పరీక్షను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఈ వెయ్యి మంది అభ్యర్థులు ఆరు రాష్ట్రాలకు చెందినవారు. ఇదిలా ఉండగా జూన్ 30న విడుదల కావాల్సిన సీయూఈటీ - యూజీ ఫలితాలు ఇప్పటివరకూ వెల్లడి కాలేదు. నీట్, నెట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలపై దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతున్న నేపథ్యంలో సీయూఈటీ-యూజీ ఫలితాల విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. వాటి విడుదలపై స్పష్టత లేదు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ టెన్త్ విద్యార్హతతో ఉద్యోగాలెన్నో్!
‣ భవితను నిర్దేశించే... మేలైన ఎంపిక!
‣ కెరియర్ ఖజానా... నైపుణ్యాల నజరానా!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.