* ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు
హైదరాబాద్: తెలంగాణలో ఏప్రిల్ 3 నుంచి జరిగే పదో తరగతి వార్షిక పరీక్షల హాల్టిక్కెట్లు విడుదలయ్యాయి. ఈ పరీక్షల హాల్టిక్కెట్లను ఎస్ఎస్సీ బోర్డు తన అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఏప్రిల్ 3 నుంచి 18వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 4,94,616 మంది విద్యార్థుల కోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. కింద పేర్కొన్న వెబ్సైట్లో విద్యార్థులు ఎస్ఎస్సీ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఏప్రిల్ 2023 ట్యాబ్పై క్లిక్ చేసి తమ జిల్లా పేరు, పాఠశాల పేరు, పుట్టిన తేదీని ఎంటర్ చేసి హాల్టిక్కెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్, ప్రైవేటు, ఓఎస్ఎస్సీ, వొకేషనల్ విద్యార్థులు తమ హాల్ టికెట్లను పొందొచ్చు.
హాల్ టికెట్ల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.