* తగ్గిన సివిల్, మెకానికల్ సంబంధిత 10 బ్రాంచీల్లో సీట్లు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో ఈసారి రికార్డుస్థాయిలో తొలి విడత కౌన్సెలింగ్లోనే 95.60 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. కన్వీనర్ కోటా కింద ఈడబ్ల్యూఎస్ సీట్లతో కలుపుకొని 78,694 సీట్లు అందుబాటులో ఉండగా.. 96,238 మంది పోటీపడ్డారు. వారిలో 75,200 అభ్యర్థులకు బీటెక్ సీట్లు దక్కాయి. తొలి విడత సీట్లను జులై 19న సాయంత్రం కేటాయించారు. ఇక మిగిలింది 3,494 మాత్రమే. సీట్లు పొందిన వారు జులై 23లోపు అలాట్మెంట్ లెటర్లో పేర్కొన్న ట్యూషన్ ఫీజు చెల్లించి ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని, లేనిపక్షంలో సీట్లు రద్దవుతాయని ఎప్సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
వెయ్యి లోపు ర్యాంకర్లలో 86 మందే
‣ 75,200 సీట్లలో 33,892 (45%) అమ్మాయిలకు దక్కాయి. ఐఐటీల్లో ఇది 20% లోపే ఉంటోంది.
‣ రాష్ట్రంలో ఓసీ, ఎస్సీ విద్యార్థులకు దక్కిన సీట్లలో 47% అమ్మాయిలు ఉండటం గమనార్హం. ఆ తర్వాత బీసీల్లో 45, ఎస్టీల్లో 38% ఉన్నారు.
‣ మొత్తంగా ఓసీలకు 15,350, బీసీలకు 39,548, ఎస్సీలకు 12,671, ఎస్టీలకు 7,631 సీట్లు దక్కాయి.
‣ వెయ్యి లోపు ర్యాంకర్లలో కేవలం 86 మందికే సీట్లు దక్కాయి. మిగిలిన వారందరూ కౌన్సెలింగ్లో పాల్గొనలేదు. వారికి ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో సీట్లు వస్తాయని నమ్మకంతో ఉండొచ్చు. 86 మందిలోనూ అందరూ రాష్ట్ర కళాశాలల్లో చేరతారన్నది అనుమానమే.
‣ 5 వేలలోపు ర్యాంకర్లలో 1,908 మందికి సీట్లు లభించాయి.
‣ సీఎస్ఈ, ఐటీ సంబంధిత 17 బ్రాంచీల్లో 53,890 సీట్లు ఉండగా 53,517 (99.31%) భర్తీ అయ్యాయి.
‣ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ సంబంధిత 9 బ్రాంచీల్లో 16,344 సీట్లుంటే 15,127 (92.55%) నిండాయి.
‣ సివిల్, మెకానికల్ సంబంధిత 10 బ్రాంచీల్లో 7,339 సీట్లకు 5,689 (77.52%) మాత్రమే భర్తీ అయ్యాయి.
టీఎస్ మాక్ కౌన్సెలింగ్స్ - 2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.