* అకడమిక్ క్యాలెండర్ను రూపొందించిన ప్రభుత్వం
![]() |
ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పాఠశాలలు ఈ విద్యా సంవత్సరంలో 233 రోజులు పని చేయనున్నాయి. మొత్తం 315 రోజులు కాగా.. ఇందులో 82 రోజులు సెలవులు ఉన్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ను రూపొందించింది. టోఫెల్ తరగతుల నిర్వహణపై ప్రభుత్వం జులై 24న నిర్ణయం వెల్లడించనుంది. దీన్ని కొనసాగించడమా? లేదా అనే దానిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రాథమిక పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 3.30 గంటల వరకు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనున్నాయి. తరగతుల నిర్వహణపై కసరత్తు చేసిన కూటమి ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్కు తుదిరూపు ఇచ్చింది.