* నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో యువతకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు పరిశ్రమలతో కలిసి పనిచేయాలని నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారులను మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. రాష్ట్రంలోని ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలలను పరిశ్రమలతో అనుసంధానించి ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. నైపుణ్యాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో లోకేశ్ జులై 4న సమీక్ష నిర్వహించారు. ‘ప్రతి ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలను స్థానికంగా ఉన్న కంపెనీలతో అనుసంధానించి, విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచేలా ప్రణాళికలు తయారు చేయాలి. ఇందులో భాగంగా అమరావతిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) కేంద్రాన్ని, మంగళగిరిలో జెమ్స్, జ్యుయలరీ శిక్షణా సంస్థను నెలకొల్పేందుకు సర్వే నిర్వహించి, తగిన చర్యలు తీసుకోవాలి. ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు విభాగాల వారీగా ప్రణాళికలు రూపొందించాలి. ఇందుకు ప్రతి అధికారి చిత్తశుద్ధితో కృషి చేయాలి. ఉపాధి కల్పనపై కేరళ అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలి’ అని ఆయన ఆదేశించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.