• facebook
  • whatsapp
  • telegram

Exam: ఆలయాల్లో ఖాళీల భర్తీకి రాత పరీక్ష ఒక్కటే

అర్చకులు, వేదపండితుల నియామకాల్లో మౌఖిక పరీక్ష కొనసాగింపు
కమిషనర్‌ అనుమతిస్తేనే నియామకాల ప్రక్రియ

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాల్లో పరిపాలనాపరమైన ఖాళీల (జూనియర్‌ అసిస్టెంట్‌ వంటి పోస్టులు) భర్తీకి ఇకపై కేవలం రాత పరీక్షతోనే ఎంపిక చేయాలని, మౌఖిక పరీక్షలు అవసరం లేదని కమిషనర్‌ ఆదేశించారు. అర్చకులు, వేదపండితులు, పరిచారకులు వంటి పోస్టులకు రాత, మౌఖిక పరీక్ష నిర్వహించాలని పేర్కొన్నారు. ఖాళీల భర్తీకి అనుసరించాల్సిన నిబంధనలను పేర్కొంటూ కమిషనర్‌ తాజాగా సర్క్యులర్‌ జారీ చేశారు.
 ఖాళీల భర్తీకి కమిషనర్‌ అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత పాలకవర్గం ఉంటే బోర్డులో ఆమోదం పొందాలి.
 ఆయా పోస్టులకు అర్హత ఉన్న వారి వివరాలను ఉపాధి కల్పనశాఖ నుంచి తీసుకోవాలి. నోటిఫికేషన్‌ను పత్రికలో ప్రకటన ఇచ్చి మూడు వారాల గడువుతో దరఖాస్తులు స్వీకరించాలి.
 పరిపాలనాపరమైన పోస్టుల భర్తీ పర్యవేక్షణకు అదనపు కమిషనర్‌, ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ (ఆర్‌జేసీ), ఉప కమిషనర్‌, సంబంధిత ఆలయ ఈవోతో కూడిన కమిటీని, ఇతర పోస్టుల భర్తీకి అధికారులతో పాటు, ఇద్దరు ఆగమ నిపుణులతో కమిటీని కమిషనర్‌ నియమిస్తారు.
 ఈ కమిటీ అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు హాల్‌టికెట్లు జారీ చేస్తుంది.
 రాతపరీక్ష ప్రశ్నావళిని నిపుణులతో కమిషనర్‌ తయారు చేయించి దానిని సీల్డ్‌ కవర్‌లో పంపి ఆర్‌జేసీ కస్టడీలో ఉంచుతారు. పరీక్షకు 10 నిమిషాల ముందు షీల్డ్‌ కవరు తెరవాల్సి ఉంటుంది.
 పరిపాలనాపరమైన పోస్టులకు 100 శాతం రాత పరీక్షకే మార్కులు ఉంటాయి. ఇందులో అధిక మార్కుల బట్టే ఎంపిక ఉంటుంది. అదే ఇతర పోస్టుల్లో 88 శాతం మార్కులకు రాతపరీక్ష, 12 శాతం మార్కులకు మౌఖిక పరీక్ష ఉంటుంది. ఆయా ఆలయాలకు నియమించిన పర్యవేక్షణ కమిటీ మౌఖిక పరీక్ష నిర్వహిస్తుంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ మేనేజ‌ర్ల‌కు టూరిజం స్వాగ‌తం!

‣ స‌త్వ‌ర ఉద్యోగాలు .. సొంత ప‌రిశ్ర‌మ‌లు!

‣ సీఎంఐ కోర్సుల‌తో పెద్ద ప్యాకేజీలు!

‣ అగ్నివీరుల‌కు ఆర్మీ ఆహ్వానం!

‣ ఫార్మసీలో పీజీకి జీప్యాట్‌!

‣ మహిళలకు యూనిఫామ్‌ సర్వీసెస్‌ కోర్సులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.