• facebook
  • whatsapp
  • telegram

UGC: అధ్యాపకుల నియామకాలు, పీహెచ్‌డీల జారీపై నిఘా

పర్యవేక్షణకు యూజీసీ స్టాండింగ్‌ కమిటీ ఏర్పాటు
ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా అన్ని విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల నియామకాలతోపాటు పీహెచ్‌డీల జారీలో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని తరచూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో యూజీసీ దిద్దుబాటు చర్యలకు దిగింది. నియామకాలు, పీహెచ్‌డీల జారీ తీరును పరిశీలించి... అవసరమైన చర్యలు తీసుకునేందుకు స్టాండింగ్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ తరచూ సమావేశమై కొన్ని విద్యాసంస్థలను ఎంపిక చేసి, వాటిలోని అన్ని పత్రాలను పరిశీలిస్తుంది. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఆ వర్సిటీలు, కళాశాలలపై చర్యలు తీసుకుంటుంది. విద్యా ప్రమాణాలను పెంచేందుకు యూజీసీ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుందని యూజీసీ ఛైర్మన్‌ ఆచార్య మామిడాల జగదీష్‌కుమార్‌ స్పష్టంచేశారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-05-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.