‣ అభ్యర్థుల ఫిర్యాదుతో వెంటనే లింకు తొలగింపు
ఈనాడు, అమరావతి: విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేయడంపై నిరుద్యోగులతో ప్రభుత్వం ఆటలాడుతోంది. ఇప్పటికే మూడు పర్యాయాలు ప్రకటనలను వాయిదా వేసిన ప్రభుత్వం ఇప్పుడు ఒక డమ్మీ పోర్టల్ను విడుదల చేసి, అభ్యర్థులను అయోమయానికి గురిచేసింది. సహాయ, అసోసియేట్ ఆచార్యుల పోస్టులకు దరఖాస్తులు స్వీకరించేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా ఓ పోర్టల్ను రూపొందించింది. దీని ద్వారా అభ్యర్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రకటన ఇచ్చిన తర్వాత ఈ పోర్టల్ను విడుదల చేయాలి. కానీ ఉన్నత విద్యామండలి డమ్మీ పోర్టల్ను బయటకు విడుదల చేసేసింది. దీన్ని చూసిన కొందరు అభ్యర్థులు నిజమైన ప్రకటన అనుకొని, దరఖాస్తు చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే అందులో దరఖాస్తుల స్వీకరణ ఐచ్ఛికం కనబడటం లేదని కొందరు ఉన్నత విద్యామండలికి ఫిర్యాదు చేయడంతో వెంటనే పోర్టల్ లింకును తొలగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 3 వేల సహాయ, అసోసియేట్ ఆచార్యుల పోస్టులు ఖాళీ ఉన్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇవికాకుండా రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయంలో 220 లెక్చరర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల నియామక ప్రకటన కోసం అభ్యర్థులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం వాయిదాల మీద వాయిదాలు వేస్తోంది.
గవర్నర్కు ఫిర్యాదులు
‣ విశ్వవిద్యాలయాల్లో పోస్టుల హేతుబద్ధీకరణ, విభాగాల విలీనాన్ని నిలిపివేయాలని కోరుతూ శ్రీకాళహస్తికి చెందిన ఓ వ్యక్తి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తమిళ విభాగాన్ని వేరే విభాగంలో విలీనం చేయడాన్ని పునఃపరిశీలించాలంటూ తమిళ సంఘం ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి గవర్నర్కు ఫిర్యాదు చేశారు. వీటిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ కార్యాలయం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శికి పంపించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆ యుద్ధంతో ఆవిర్భవించిన మహా సామ్రాజ్యం!
‣ ఆత్మవిశ్వాసంతో అద్భుత విజయాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.