• facebook
  • whatsapp
  • telegram

IIM: ఐఐఎం డైరెక్టర్లు కావాలంటే ప్రథమ శ్రేణి ఉత్తీర్ణత తప్పనిసరి

నియామక అధికారం రాష్ట్రపతికి..
దిల్లీ: ఐఐఎం డైరెక్టర్ల నియామకానికి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తెచ్చింది. ఇక నుంచీ డైరెక్టర్ల పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునేవారు డిగ్రీ, పీజీల్లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. అంతేకాకుండా ప్రఖ్యాత విద్యా సంస్థల్లో పీహెచ్‌డీగానీ, దానికి సమానమైన అర్హత ఉన్న పరిశోధనగానీ చేసి ఉండాలి. ఇటీవల ఐఐఎం రోహ్‌తక్‌ డైరెక్టరుగా ధీరజ్‌ శర్మ నియమితులయ్యారు. ఆయన డిగ్రీలో ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. దీనిపై వివాదం తలెత్తింది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వీటి ప్రకారం.. ‘విజిటర్‌’ హోదాలో రాష్ట్రపతి.. ఐఐఎంలపై అధికారం కలిగి ఉంటారు. ఐఐఎంల బోర్డు ఆఫ్‌ గవర్నర్ల ఛైర్‌పర్సన్‌ను నియమిస్తారు. బోర్డు సిఫార్సుల మేరకు డైరెక్టర్లను నియమించే, తొలగించే అధికారం రాష్ట్రపతికే ఉంటుంది. అవసరమైతే బోర్డును రద్దు చేసే అధికారమూ రాష్ట్రపతికే ఉంటుంది. గతంలో డైరెక్టర్లను నియమించే అధికారం బోర్డుకే ఉండేది.

మరింత సమాచారం... మీ కోసం!

ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

సెయిల్‌లో టెక్నీషియన్‌ ట్రైనీలు

ఐఎంఐలో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌

ఆర్‌సీఎఫ్‌ఎల్‌లో 408 అప్రెంటిస్ ఖాళీలు 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.