రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఏర్పాటుకు కసరత్తు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో పరిశోధనను పెంచి... ఆసక్తి ఉన్న ఆచార్యులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా పరిశోధన నిధి(రీసెర్చ్ ఫండ్)ని సమకూర్చాలని రాష్ట్ర విద్యాశాఖ భావిస్తోంది. గత అయిదారు నెలలుగా ఈ దిశగా కసరత్తు సాగుతుండగా తాజాగా విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఆధ్వర్యంలో వర్సిటీల ఉపకులపతులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. సాధారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డీఎస్టీ), యూజీసీ, ఏఐసీటీఈ, డీఆర్డీఏ, బయోటెక్నాలజీ విభాగం (డీబీటీ), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ (ఐసీఎస్ఎస్ఆర్) తదితర విభాగాలు పరిశోధన ప్రాజెక్టులు మంజూరు చేస్తుంటాయి. తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత మొత్తాన్ని పరిశోధన కోసం కేటాయించాలనుకొంటోంది. దీనికోసం రూ.25 కోట్ల పరిశోధన నిధిని సమకూర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందుకు ఎంపిక చేసిన అంశాలపై పరిశోధనలకు ఆసక్తి ఉన్న విశ్వవిద్యాలయాల ఆచార్యులను దరఖాస్తుల ద్వారా ఎంపిక చేయాలని, ముఖ్యంగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ఆయా అంశాలపై పరిశోధన జరపాలని భావిస్తోంది. ఇప్పటికే విధి విధానాల రూపకల్పనకు ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రి, ఐఐటీ డైరెక్టర్ ఆచార్య మూర్తి, ఐఐసీటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, హెచ్సీయూ ఉపకులపతి ఆచార్య బీజే రావు, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్) డిప్యూటీ డైరెక్టర్ అసీమ్ ప్రకాశ్లతో సలహా కమిటీని కూడా నియమించింది. పరిశోధనకు నిధులు అందించడంతోపాటు ఐఐటీ హైదరాబాద్ తదితర సంస్థలతో కలిసి లోతైన పరిశోధనలు ఎలా చేయాలనే అంశంపై ఆచార్యులకు శిక్షణ ఇప్పించాలని, ఆయా వర్సిటీల్లో కావాల్సిన కేంద్రీకృత ల్యాబ్లను నెలకొల్పాలని విద్యాశాఖ భావిస్తోంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.