కరెన్సీనగర్, న్యూస్టుడే: ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 షార్ట్ టర్మ్(3 నెలలు) కోర్సులను ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థలో ప్రారంభిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఎం.కనకారావు ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి అర్హతతో ఎలక్ట్రీషియన్ డొమెస్టిక్ సొల్యూషన్స్, ప్లంబర్ జనరల్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. ఎంపిక చేసిన విద్యార్థులకు బస్పాస్ సౌకర్యం కల్పించనున్నట్టు పేర్కొన్నారు. కోర్సు శిక్షణ కాలం పూర్తి చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వంచే ధ్రువపత్రం అందిస్తామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, నవంబరు 20వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 0866-2475575, 77804-29468, 91825-34259 సంప్రదించవచ్చన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సమాఖ్య వ్యవస్థకు సమన్వయ సూత్రాలు!
‣ మైక్రోసాఫ్ట్లో రూ.52 లక్షల ప్యాకేజీ ఇంజినీరింగ్ విద్యార్థిని సంహిత ఘనత
‣ మీ కెరియర్ ‘డిజైన్’ చేసుకోండి!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.