ఈనాడు, అమరావతి: గ్రామ పశుసంవర్ధక సహాయకుల (వీఏహెచ్ఏ) పోస్టుల భర్తీకి.. ఈడబ్ల్యూఎస్ కోటా వర్తింపజేయకపోవడంపై అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. పశుసంవర్ధక శాఖ నిర్ణయం కారణంగా అర్హులైన తమకు తీరని అన్యాయం జరుగుతోందని వారు వాపోతున్నారు. రాష్ట్రంలో 1,896 వీఏహెచ్ఏ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నవంబరు 20న నోటిఫికేషన్ ఇచ్చింది. గతంలో 9,844 మంది వీఏహెచ్ఏల నియామకానికి ప్రకటన ఇవ్వగా అప్పుడు ఖాళీగా మిగిలిన 1,896 పోస్టులను తాజాగా భర్తీ చేస్తోంది. దీనికి డిసెంబరు 11లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కానీ ఈ పోస్టుల భర్తీలో ఈడబ్ల్యూఎస్ కింద 10% రిజర్వేషన్లు వర్తింపజేయడం లేదు. ప్రభుత్వం ఇటీవల జారీ చేస్తున్న నోటిఫికేషన్లకు సంబంధించి దానిని అమలు చేస్తున్నా.. వీఏహెచ్ఏల పోస్టుల భర్తీ విషయంలో మాత్రం పక్కన పెట్టింది. అయితే ఇవి 2019లో మంజూరైన పోస్టులు కావడంతో ఆ రిజర్వేషన్లు వర్తించవని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ అమరేంద్రకుమార్ చెబుతుండగా.. పోస్టుల భర్తీ సమయంలో ఏ ఉత్తర్వులు అమల్లో ఉన్నాయో వాటినే అమలు చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.
నష్టపోతామని ఆవేదన
ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తే తనకు 5 ఏళ్ల వయసు వెసులుబాటు లభిస్తుందని కర్నూలు జిల్లాకు చెందిన వసుంధర చెబుతుండగా.. 3% మహిళల కోటా కింద తనకూ అవకాశం వస్తుందని అదే జిల్లాకు చెందిన నాగలక్ష్మి పేర్కొంటున్నారు. లేదంటే తమతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది నష్టపోతారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జేఈఈ మెయిన్ విజయానికి కీలకాంశాలు
‣ ఒకటే పరీక్ష.. లక్షన్నర కొలువులు!
‣ ఎయిమ్స్ సంస్థల్లో 3 వేల ఉద్యోగాలు
‣ స్టేట్ బ్యాంకులో 8,773 క్లర్క్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.