• facebook
  • whatsapp
  • telegram

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

* పరీక్షకు పాత సిలబసే!


 

ఈనాడు, హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) గాను బీటెక్‌లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను వచ్చే ఏడాది మే 26వ తేదీన నిర్వహించనున్నారు. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలు వహిస్తున్న ఐఐటీ మద్రాస్‌.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2024 వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో పరీక్ష కాలపట్టిక, సిలబస్‌లను పొందుపరిచింది. జేఈఈ మెయిన్‌లో కనీస మార్కులు సాధించిన 2.50 లక్షల మంది మాత్రమే అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రాయడానికి అర్హులు. జేఈఈ మెయిన్‌కు ఈసారి సిలబస్‌ను తగ్గించిన సంగతి తెలిసిందే. మూడు సబ్జెక్టుల్లో కొన్ని పాఠ్యాంశాలను ఎన్‌టీఏ తొలగించింది. దానివల్ల జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు కూడా అదే సిలబస్‌ ఉంటుందా? లేదా? అన్న సందిగ్ధం నెలకొంది. అయితే గత పరీక్షకు ఉన్న సిలబసే ఈసారి కూడా ఉంటుందని వెబ్‌సైట్లో ఉంచిన సిలబస్‌ను బట్టి స్పష్టమవుతోందని శ్రీచైతన్య విద్యాసంస్థల ఐఐటీ జాతీయ డీన్‌ ఎం.ఉమాశంకర్‌ తెలిపారు. ఈ మేరకు అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యేవారు పూర్తి సిలబస్‌ను చదవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు.


ఏప్రిల్‌ 20న జేఈఈ మెయిన్‌ ర్యాంకులు!

జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 12వ తేదీ నాటికి ముగుస్తాయి. వాటి ఫలితాలు వచ్చిన మరుసటి రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ప్రారంభమవుతుంది. అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ ఏప్రిల్‌ 21వ తేదీ నుంచి మొదలవుతుందని ఐఐటీ మద్రాస్‌ వెల్లడించిన నేపథ్యంలో జేఈఈ మెయిన్‌ ర్యాంకులు ఏప్రిల్‌ 20వ తేదీన వెల్లడవుతాయని స్పష్టమవుతోంది. అంటే ఆ రోజు రాత్రి ర్యాంకులు ప్రకటిస్తారు. ఆ రోజు వీలు కాకుంటే ఏప్రిల్‌ 21వ తేదీ ఉదయం 10 గంటల లోపు కచ్చితంగా ర్యాంకులు వెల్లడవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌: ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు.

హాల్‌టికెట్లు: మే 17-26 వరకు అందుబాటులో ఉంటాయి.

అడ్వాన్స్‌డ్‌ పరీక్ష: పేపర్‌-1 ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, పేపర్‌-2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు.

రీక్ష ప్రాథమిక కీ విడుదల: జూన్‌ 2న. దానిపై అభ్యంతరాలు, అభిప్రాయాలను 3వ తేదీ వరకు పంపొచ్చు.

ఫలితాల విడుదల: జూన్‌ 9వ తేదీ ఉదయం 10 గంటలకు.

ఆర్కిటెక్చర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ రిజిస్ట్రేషన్‌: జూన్‌ 9వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 10వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు (అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైన వారే అర్హులు).

ప్రవేశాలకు జోసా కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభం: జూన్‌ 10వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి..

ఏఏటీ-2024 పరీక్ష: జూన్‌ 12వ తేదీ ఉదయం 9 నుంచి 12 గంటల వరకు (ఐఐటీల్లోని బీఆర్క్‌ కోర్సుల్లో చేరేందుకు).

ఏఏటీ ఫలితాల వెల్లడి: జూన్‌ 15వ తేదీ సాయంత్రం 5 గంటలకు.

JEE-ADVANCED Study Material 

 Physics

‣ Chemistry

‣ Mathematics

‣ PREVIOUS PAPERS

‣ MODEL PAPERS

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 25-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.