పులివెందుల, న్యూస్టుడే: వైయస్ఆర్ జిల్లా పులివెందుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు మూలకు చేరాయి. మండలంలోని 55 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6,715 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ 3 జతల చొప్పున ఏకరూప దుస్తులు, ఒక జత చొప్పున బూట్లు, సాక్సులు అందించాల్సి ఉంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ప్రతిపాదనల మేరకు దుస్తులు అందించి మిగిలిన వాటిని వెనక్కి పంపాల్సి ఉన్నా ఇలా మూలన పడేశారు. వీటిని పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలోని ఓ గదిలో మూటలుగా కట్టి వదిలేయడంతో దుమ్ము, ధూళి పేరుకుపోతోంది. గత విద్యాసంవత్సరం నుంచి అవి నిరుపయోగంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇన్ఛార్జి ఎంఈవో శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా.. రెండు రోజుల క్రితమే తాను బాధ్యతలు చేపట్టానని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో చాలామంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు తక్కువగా వచ్చాయని, గదిలో ఉన్నవి పాతవి అయిఉండొచ్చని.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!
‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!
‣ రిమోట్ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!
‣ ఉద్యోగ సాధనకు డిజిటల్ వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.