• facebook
  • whatsapp
  • telegram

School Uniforms: నిరుపయోగంగా ఏకరూప దుస్తులు

పులివెందుల, న్యూస్‌టుడే: వైయస్‌ఆర్‌ జిల్లా పులివెందుల మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించాల్సిన ఏకరూప దుస్తులు, బూట్లు, సాక్సులు మూలకు చేరాయి. మండలంలోని 55 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లోని 6,715 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికీ 3 జతల చొప్పున ఏకరూప దుస్తులు, ఒక జత చొప్పున బూట్లు, సాక్సులు అందించాల్సి ఉంది. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయుల ప్రతిపాదనల మేరకు దుస్తులు అందించి మిగిలిన వాటిని వెనక్కి పంపాల్సి ఉన్నా ఇలా మూలన పడేశారు. వీటిని పట్టణంలోని ఎమ్మార్సీ కార్యాలయంలోని ఓ గదిలో మూటలుగా కట్టి వదిలేయడంతో దుమ్ము, ధూళి పేరుకుపోతోంది. గత విద్యాసంవత్సరం నుంచి అవి నిరుపయోగంగా ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. ఈ విషయంపై ఇన్‌ఛార్జి ఎంఈవో శ్రీనివాసులరెడ్డిని వివరణ కోరగా.. రెండు రోజుల క్రితమే తాను బాధ్యతలు చేపట్టానని తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో చాలామంది విద్యార్థులకు ఏకరూప దుస్తులు తక్కువగా వచ్చాయని, గదిలో ఉన్నవి పాతవి అయిఉండొచ్చని.. పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఒత్తిడిని జయించే మార్గాలివిగో!

‣ ప్రత్యేక ఎంబీఏ కోర్సులు.. రూ.లక్షల్లో జీతాలు!

‣ రిమోట్‌ కొలువుకు పెరుగుతున్న ఆదరణ!

‣ ఉద్యోగ సాధనకు డిజిటల్‌ వ్యూహం!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-11-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.