ఈనాడు, హైదరాబాద్: జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ఫీజును వరుసగా రెండో ఏడాదీ పెంచారు. అమ్మాయిలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు గత ఏడాది రూ.1450 ఉండగా దాన్ని రూ.1600లకు, ఇతరులకు రూ.2,900ల నుంచి రూ.3,200లకు పెంచినట్లు ఐఐటీ మద్రాస్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ సారి కూడా బాలికలకు 20 శాతం సీట్లు సూపర్న్యూమరరీ కోటా కింద కేటాయిస్తారు. జేఈఈ మెయిన్లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణులైన 2.50 లక్షల మందే అడ్వాన్స్డ్ రాయడానికి అర్హులు. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఏటా సుమారు 40 వేల మంది అడ్వాన్స్డ్ పరీక్షకు అర్హత సాధిస్తున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డేటా లిటరసీ.. సరికొత్త నైపుణ్యం!
‣ 26,146 కానిస్టేబుల్ ఖాళీలకు ప్రకటన
‣ ఐటీఐతో విద్యుత్ సంస్థలో ఉద్యోగాలు
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.