విద్యావేత్తల సదస్సులో గవర్నర్ పిలుపు
ఈనాడు, హైదరాబాద్: వికాస భారత్ లక్ష్యాన్ని 2047 నాటికి సాధించేలా ఏం చేయాలనే అంశంపై విలువైన ఆలోచనలు పంచుకునేలా విద్యార్థులను ప్రోత్సహించాలని విద్యావేత్తలకు, అధ్యాపకులకు గవర్నర్ డాక్టర్ తమిళిసై సూచించారు. నీతి ఆయోగ్, అన్ని రాష్ట్రాల రాజ్భవన్ల సహకారంతో ‘వికాస భారత్-2047’ లక్ష్యాన్ని వివరిస్తూ డిసెంబరు 11న రాజ్భవన్లో ‘సైన్స్, టెక్నాలజీ ఆవిష్కరణల్లో భారత్ సాధికారత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. వికాస భారత్ విజన్ను రూపొందించడంలో విద్యావేత్తలను, విద్యార్థులను భాగస్వాములను చేయడానికి ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వర్చువల్ ప్రసంగాలతో సదస్సు ప్రారంభమైంది. అనంతరం గవర్నర్ ప్రసంగిస్తూ.. దేశానికి ఇంత గొప్ప లక్ష్యాన్ని నిర్దేశించిన ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. తాను గవర్నర్గా ఉన్న తెలంగాణ, పుదుచ్చేరిలు ఈ లక్ష్యాన్ని సాధించడంలో ముందుంటాయని ఆమె పేర్కొన్నారు. విద్యావేత్తలు ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించాలని స్పష్టం చేశారు. రాష్ట్ర, కేంద్రీయ విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, అధ్యాపకులు ఈ సదస్సులో పాల్గొని వారి ఆలోచనలను పంచుకున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ స్పోర్ట్స్ మేనేజ్మెంట్లో కెరియర్ అవకాశాలు
‣ ఐడీబీఐ బ్యాంకులో 2,100 కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.