• facebook
  • whatsapp
  • telegram

Education: నాణ్యమైన విద్య ప్రభుత్వ బాధ్యత

సర్కారు బడుల్లో మౌలికవసతులు కల్పించాలి
చర్చాగోష్ఠిలో ఎమ్మెల్సీ, పౌర స్పందన వేదికరాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థల కారణంగా.. ప్రభుత్వ విద్యకు ఆదరణ తగ్గిపోతోందని ఎమ్మెల్సీ, పౌర స్పందన వేదిక రాష్ట్ర అధ్యక్షుడు అలుగుబెల్లి నర్సిరెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో ఎల్‌కేజీ స్థాయి నుంచి ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలను బలోపేతం చేసి మౌలికవసతులు కల్పించాలని కోరారు. బాలబాలికలకు మధ్యాహ్న భోజన పథకంలో పోషకాహారంతోపాటు, నాణ్యమైన విద్య అందిస్తే ప్రభుత్వ బడులకు పూర్వవైభవం లభిస్తుందని పేర్కొన్నారు. ఇది సర్కారు బాధ్యతని సూచించారు. డిసెంబ‌రు 28న‌ హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో.. పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ‘ప్రభుత్వ విద్య బాగుపడాలి- విద్యలో అంతరాలు పోవాలి’ అనే అంశంపై నిర్వహించిన మీడియా చర్చాగోష్ఠిలో ఆయన మాట్లాడారు. ‘‘ప్రస్తుత పోటీ పరిస్థితులను తట్టుకుని నిలబడేలా సర్కారు బడుల్లో చదువుతున్న విద్యార్థులను ఆంగ్ల భాషలో నిపుణులుగా తీర్చిదిద్దాలి. కొఠారి కమిషన్‌ సిఫార్సులను అమలుచేసి.. కేరళ, దిల్లీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల తరహాలో తెలంగాణలోనూ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్‌లో 30 శాతం నిధులు కేటాయించాలి. ఖాళీ పోస్టులను సత్వరం భర్తీచేయాలి. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు అంకితభావంతో పనిచేస్తూ.. బడిలో పిల్లల సంఖ్యను, ఉత్తీర్ణత శాతాన్ని రెట్టింపు చేసేలా కీలక భూమిక పోషించాలి. తమ పిల్లలనూ సర్కారు బడుల్లో చేర్పించి మార్గదర్శకంగా నిలవాలి. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను కొత్త ప్రభుత్వం అమలుచేయాలి. ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల దోపిడీని నియంత్రించడంతోపాటు ప్రభుత్వ విద్యలో నెలకొన్న అంతరాలను రూపుమాపాలి’’ అని సూచించారు. పౌరస్పందన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.రాధేశ్యాం మాట్లాడుతూ.. సమాజంలోని అన్నివర్గాల విద్యార్థులకు ఒకే తరహా విద్యను అందించేలా ప్రభుత్వం చొరవచూపాలని కోరారు. సమావేశంలో వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌, ప్రధాన కార్యదర్శి ఎంఏ సమ్మాద్‌ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం... మీ కోసం!

‣ నౌకాదళంలో 910 సివిల్‌ కొలువులు

‣ ఫుట్‌వేర్‌ తయారీలో శిక్షణ ఇలా..

‣ ఉక్కు సంస్థలో ఉన్నత ఉద్యోగాలు

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.