• facebook
  • whatsapp
  • telegram

Mega DSC: మెగా డీఎస్సీ నిర్వహించాలని నిరుద్యోగ అభ్యర్థుల నిరసన

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి తక్షణమే మెగా డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పలు జిల్లాల్లో కలెక్టరేట్ల వద్ద నిరుద్యోగ అభ్యర్థులు నిరసనలు చేశారు. డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లిలోని సీఎం కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కర్నూలు, కడప, ఎన్టీఆర్‌, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఆందోళనలు చేశారు. కర్నూలులో బిర్లా గేట్‌ నుంచి కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాట్లాడుతూ..‘‘జగన్‌ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నేను ఉన్నాను.. నేను విన్నాను. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. మెగా డీఎస్సీ నిర్వహిస్తామని గొప్పగా ప్రచారం చేశారు. ఐదేళ్ల పాలన పూర్తవుతున్నా ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీ చేయలేదు’’ అని పేర్కొన్నారు.
 


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!

‣ బీమా సంస్థలో కొలువులు

‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ

‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?

‣ పుడమి పరిరక్షణకు పర్యావరణ న్యాయవాదులు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 29-12-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.