1. ‘స్వచ్ఛ సర్వేక్షణ్’లో తెలంగాణకు అవార్డుల పంట
పారిశుద్ధ్య నిర్వహణలో రాష్ట్రానికి జాతీయ స్థాయిలో పలు అవార్డులు దక్కాయి. స్వచ్ఛ సర్వేక్షణ్, గార్బేజ్ ఫ్రీ సిటీ విభాగాల్లో తెలంగాణలోని 20 పురపాలికలు 22 పురస్కారాలు సాధించాయి. ఏటా కేంద్ర గృహ నిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దేశవ్యాప్తంగా వివిధ ప్రమాణాల మేరకు ఈ అవార్డులను ఇస్తుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. పల్లె స్థాయిలో వాతావరణ అంచనాలు
వాతావరణ అంచనాలను వచ్చేవారం నుంచి గ్రామ పంచాయతీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ‘భారత వాతావరణ విభాగం’ (ఐఎండీ) తెలిపింది. ఆంగ్లం, హిందీ సహా 12 భారతీయ భాషల్లో ఇవి అందుబాటులో ఉంటాయని ఆ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మహాపాత్ర పీటీఐ వార్తాసంస్థ ముఖాముఖిలో తెలిపారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా మైక్రోసాఫ్ట్
ప్రపంచంలో అత్యంత విలువైన కంపెనీగా యాపిల్ను అధిగమించి మైక్రోసాఫ్ట్ సరికొత్త ఘనత సాధించింది. 2021 తర్వాత తొలిసారిగా యాపిల్ మార్కెట్ విలువ మైక్రోసాఫ్ట్ కంటే 0.9 శాతం కిందకు దిగజారింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. 100 బి.డాలర్ల క్లబ్లో ముకేశ్ అంబానీ
100 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.8.3 లక్షల కోట్లు) సంపద కలిగిన సంపన్నుల జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ చేరారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు తాజా రికార్డు గరిష్ఠాలకు చేరడం ఇందుకు కలిసొచ్చింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. బంగ్లా ప్రధానిగా 5వ సారి హసీనా ప్రమాణస్వీకారం
బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా అయిదోసారి షేక్ హసీనా (76) ప్రమాణస్వీకారం చేశారు. అధ్యక్ష భవనంలో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, పౌర ప్రముఖులు, విదేశీ ప్రతినిధులు హాజరయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.