1. దేశంలో అతిపొడవైన సముద్రపు వంతెన ప్రారంభం
వాణిజ్య రాజధాని ముంబయిలో నిర్మించిన దేశంలో అత్యంత పొడవైన సముద్రపు వంతెన ‘ముంబయి ట్రాన్స్ హార్బర్ లింక్’ (ఎంటీహెచ్ఎల్)ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ముంబయిలోని సేవ్రీ నుంచి రాయ్గఢ్ జిల్లా నవాశేవాను కలుపుతూ దీనిని సిద్ధం చేశారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. అమెజాన్ అడవుల్లో బయటపడిన అతి పురాతన నగరం
రెండు వేల సంవత్సరాల క్రితం అత్యంత రద్దీ ప్రాంతంగా ఉండి ఆ తర్వాత మరుగునపడిన ఓ పురాతన నగరం ఇటీవల అమెజాన్ అడవుల్లో బయటపడింది. పురాతత్వ శాస్త్రవేత్తలు ఈక్వెడార్లో దీనిని గుర్తించినట్లు ‘ది జర్నల్ సైన్స్’ పత్రిక పేర్కొంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. ఎనిమిది నెలల కనిష్ఠానికి పారిశ్రామికోత్పత్తి
దేశీయ పారిశ్రామికోత్పత్తి వృద్ధి 2023 నవంబరులో 2.4 శాతంగా నమోదైంది. ఇది 8 నెలల కనిష్ఠస్థాయి. తయారీ రంగం నిరాశపరచడం ప్రభావం చూపింది. ఇంతకు ముందు 2023 మార్చిలో అత్యల్పంగా 1.9% వృద్ధి నమోదైంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ఉత్తర కొరియాపై నిఘా కోసం జపాన్ ఉపగ్రహ ప్రయోగం
ఉత్తర కొరియాపై నిఘా వేసేందుకు జపాన్ కీలక ముందడుగు వేసింది. ఒక నిఘా ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇది ఉత్తర కొరియా దళాల కదలికలను పసిగట్టనుంది. అలాగే వాతావరణంలో ముప్పులను ముందస్తుగా గ్రహించి అప్రమత్తం చేస్తుంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. మెడ్టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్ ముగింపు
హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఏషియన్ మెడ్టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్-2024 సదస్సు ముగిసింది. ఈ సదస్సుకు వైద్య, ఆరోగ్య ప్రముఖులతోపాటుసాంకేతిక నిపుణులు హాజరయ్యారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.