• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 13-01-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. ఉగ్రవాదుల నిరోధానికి ‘ఆపరేషన్‌ సర్వశక్తి’

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్థాన్‌ అమలుచేస్తున్న ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్‌ సర్వశక్తి’ని ప్రారంభించింది. పీర్‌ పంజాల్‌ పర్వత శ్రేణుల్లో దక్షిణాన ముఖ్యంగా రాజౌరీ పూంఛ్‌ సెక్టారులో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాక్‌ అండ ఉన్న ఉగ్రమూకలు చెలరేగుతున్నాయి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. మిజోరంలో కొత్త రకం పాముజాతి

మిజోరం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర విభాగం పరిశోధకులు ఆ రాష్ట్రంలో కొత్త రకం పాము జాతి (కోరల్‌ స్నేక్‌)ని గుర్తించారు. బ్రిటిష్‌-ఇండియావైద్యుడు గోరే పేరు మీద ఈ పాముకు ‘సినోమైక్రరస్‌ గోరి’గా నామకరణం చేశారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


3. తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో లాయ్‌ చింగ్‌ విజయం

తైవాన్‌ అధ్యక్ష ఎన్నికల్లో అధికార డెమొక్రటిక్‌ ప్రోగ్రెసివ్‌ పార్టీ (డీపీపీ) అభ్యర్థి లాయ్‌ చింగ్‌ తె విజయం సాధించారు. ప్రస్తుతం ఆయన ఆ దేశ ఉపాధ్యక్షుడిగా ఉన్నారు. గత ఎనిమిదేళ్లుగా దేశాధ్యక్షురాలిగా కొనసాగుతున్న త్సాయింగ్‌ వెన్‌ స్థానంలో బాధ్యతలు చేపడతారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


4. యాదాద్రి ఆలయానికి ప్రత్యేక గుర్తింపు

కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) నుంచి భోగ్‌ (బ్లిస్‌ఫుల్‌ హైజీనిక్‌ ఆఫరింగ్‌ టు గాడ్‌) జాతీయ స్థాయి గుర్తింపు పత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి లభించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


5. మలేసియా ఓపెన్‌ ఫైనల్లో సాత్విక్, చిరాగ్‌ జోడీ 

భారత షట్లర్లు సాత్విక్‌ సాయిరాజ్, చిరాగ్‌ శెట్టి జోడీ మలేసియా ఓపెన్‌ సూపర్‌ 1000 టోర్నీలో ఫైనల్‌కు వెళ్లింది. ఓపెన్‌ శకంలో భారత షట్లర్లు ఈ టోర్నీ ఫైనల్‌ చేరడం ఇదే తొలిసారి. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-01-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.