గుడివాడ గ్రామీణం, న్యూస్టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ, జిల్లా ఉపాధికల్పన శాఖ సంయుక్తాధర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు జనవరి 25న ఉదయం 9:30 గంటలకు గుడివాడ వీకేఆర్, వీఎన్బీ ఏజీకే ఇంజినీరింగ్ కళాశాలలో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ఉపాధి కల్పన శాఖ అధికారి దేవరపల్లి విక్టర్ బాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎస్.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఎఫ్ట్రానిక్స్, చందు సాఫ్ట్ టెక్నాలజీస్, హెటిరో ల్యాబ్స్, ముత్తూట్ ఫైనాన్స్, జోయాలుక్కాస్, సుధీర్ టింబర్ డిపో ప్రైవేట్ లిమిటెడ్, గోల్డ్ ప్రిన్స్, వి.ఎన్.ఆర్.జ్యూవెలరీస్, మోహన్ స్పిన్టెక్స్ లిమిటెడ్, నవత ట్రాన్స్పోర్ట్సు, మెడ్ప్లస్ ఫార్మసీ, వరుణ్ మోటార్స్, సంతోష్ ఆటోమొబైల్స్ లాంటి 13 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు. 7 నుంచి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమ, ఇంటర్, డిగ్రీ, ఫార్మసీ, బీటెక్, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు పాల్గొని ఉపాధి అవకాశాలు పొందాలన్నారు. ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి రూ.9వేలు నుంచి రూ.30 వేలు జీతం, ఇతర అలవెన్సులు ఉంటాయన్నారు. ఆసక్తి గలవారు స్కిల్యూనివెర్స్డాట్ఏపీఎస్ఎస్డిసిడాట్ఇన్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని నేరుగా ఇంటర్వ్యూకు హాజరుకావాలన్నారు. వివరాలకు 79819 38644, 98488 19682 నంబర్లలో సంప్రదించాలన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఉపాధికి దిక్సూచి.. బిజినెస్ అనలిటిక్స్
‣ విదేశీ విద్య.. అవగాహన ముఖ్యం!
‣ ఏఐ నైపుణ్యం.. తక్షణ కర్తవ్యం!
‣ ఇష్టం పెంచుకుంటే.. కష్టం కాదు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.