ఈనాడు, హైదరాబాద్: స్టాఫ్ నర్సుల పోస్టులకు ఎంపికైన వారి తుది జాబితాను రాష్ట్ర వైద్య, ఆరోగ్యసేవల రిక్రూట్మెంట్ బోర్డు (ఎంహెచ్ఎస్ఆర్బీ) ఆదివారం వెల్లడించింది. వైద్య, ఆరోగ్యశాఖలో తొమ్మిది విభాగాల్లో ఎంపికైన 6,956 మంది స్టాఫ్నర్సుల మెరిట్ జాబితాను ప్రకటించింది. వైద్య విద్య డైరెక్టరేట్ (డీఎంఈ) పరిధిలోని వివిధ ఆసుపత్రులు, గురుకులాల్లో స్టాఫ్నర్సుల ఉద్యోగాలకు మొత్తం 40 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. గత ఏడాది ఆగస్టు 2న రాతపరీక్ష నిర్వహించారు. రిజర్వేషన్లు, జోన్లవారీగా ఎంపికైన అభ్యర్థులు, కటాఫ్ ర్యాంకులు, అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను ఎంహెచ్ఎస్ఆర్బీ తాజాగా వెల్లడించింది.
31న స్టాఫ్నర్స్లకు నియామక పత్రాలు
నారాయణగూడ, న్యూస్టుడే: జవవరి 31న ఎల్బీ స్టేడియంలో కొత్తగా ఎంపికైన స్టాఫ్నర్స్లకు నియామక పత్రాలు అందించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరుకానున్నారు. స్టేడియంలో ఏర్పాట్లపై ఆదివారం అధికారులు సమావేశమయ్యారు. ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా చొంగ్తు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కర్ణన్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్, నగర పోలీస్ జాయింట్ కమిషనర్ విక్రమ్సింగ్ మాన్, సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ అశోక్రెడ్డి, కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.