1. భాగ్యవిధాతకు భారతరత్న
కేంద్ర ప్రభుత్వం ఒకేసారి ముగ్గురు దిగ్గజాలకు ‘భారతరత్న’ ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రులు పీవీ నరసింహారావు, చౌధరీ చరణ్సింగ్లతోపాటు ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త ఎం.ఎస్.స్వామినాథన్లను దేశ అత్యున్నత పౌర పురస్కారానికి ఎంపిక చేసింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. మూడో దఫా ప్రభుత్వంలో ఇంతకుమించి భారీ నిర్ణయాలు
కేంద్రంలో తన నేతృత్వంలో ఏర్పడబోయే మూడో దఫా ప్రభుత్వానికి పూర్తిస్థాయి మార్గసూచీ తయారీని ఇప్పటికే ప్రారంభించినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. 20-30 రోజుల్లో దీనికి తుది రూపం వస్తుందన్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. దేశంలో 97 కోట్ల మంది ఓటర్లు!
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దాదాపు 97 కోట్ల మంది భారతీయులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కొత్తగా దాదాపు రెండు కోట్ల మంది(18-29 మధ్య వయస్సు గల) యువ ఓటర్లను జాబితాలో చేర్చినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. న్యూయార్క్ కోర్టు జడ్జిగా భారతీయుడు
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ న్యూయార్క్లోని అమెరికా తూర్పు జిల్లా కోర్టు న్యాయమూర్తిగా భారత సంతతికి చెందిన సంకేత్ జయేశ్ బల్సారా (46)ను నియమించినట్లు శ్వేతసౌధం ప్రకటించింది. బల్సారా ఇదే కోర్టు మేజిస్ట్రేటుగా 2017 నుంచి పనిచేస్తున్నారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. నిర్మలపై ఎనిమిదేళ్ల నిషేధం
భారత అథ్లెట్ నిర్మల షెరాన్పై జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ క్రమశిక్షణ ప్యానల్ ఎనిమిదేళ్ల నిషేధాన్ని విధించింది. గతేడాది నిర్వహించిన పరీక్షలో ఆమె నిషేధిత ఉత్ప్రేరకం వాడిందని తేలడంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2017 ఆసియా ఛాంపియన్షిప్లో నిర్మల 400 మీటర్ల పరుగులో పసిడి గెలిచింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.