• facebook
  • whatsapp
  • telegram

Inter exams: ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్ధం

ఈనాడు, హైదరాబాద్‌: గ్రేటర్‌లో ఇంటర్మీడియట్‌ పరీక్షల నిర్వహణకు యంత్రాంగం సిద్ధమైంది.  మూడు జిల్లాల ఇంటర్‌ విద్య అధికారులతో ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశమై ప్రశ్న పత్రాల భద్రతపై చర్చించారు. విద్యార్థులకు వారి కళాశాల నుంచి రెండు,మూడు కిలోమీటర్ల లోపే పరీక్షా కేంద్రాలున్నాయా? లేదా? అని పరిశీలించారు. గ్రేటర్‌ పరిధిలోనే ఎక్కువ కళాశాలలు, నాలుగు లక్షలమంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో హైపర్‌ కమిటీలను నియమించారు. ఇవి జిల్లాలోని అన్నిశాఖల అధికారులతో ఫిబ్రవరి 24లోపు సమావేశాలు పూర్తి చేయాలని నిర్ణయించారు.

ప్రత్యేక బస్సులు..: ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభవుతుండగా. అధికారులు పదిరోజుల ముందే పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు పరీక్షలు కొనసాగుతాయి. గ్రేటర్‌లో ఐదువందలకుపైగా కేంద్రాలుండగా... సకాలంలో చేరుకునేందుకు వీలుగా ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు, రవాణా సౌకర్యాలు కల్పించాలని ఇంటర్‌బోర్డు అధికారులు ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో పాటు పరీక్షా కేంద్రాలకు సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూపివేయనున్నారు.

సీసీ కెమెరాల నిఘా..హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో 544 పరీక్షా కేంద్రాలున్నాయి. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. తాగునీరు అందుబాటులో ఉండే లా చర్యలు చేపట్టనున్నారు. తాత్కాలిక ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కేంద్రాల్లో నిరాటంకంగా విద్యుత్‌ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టనున్నారు.
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.