• facebook
  • whatsapp
  • telegram

Jobs: 21న ఉద్యోగమేళా  

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 21వ తేదీన బుధవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్‌ బాబు సోమవారం తెలిపారు. ప్రభుత్వ ఐటీఐ ఆవరణలో జరిగే ఉద్యోగ మేళాలో వరుణ్‌ మోటార్, బి జెడ్‌ ఫిన్ఫర్వ్, రిలయన్స్‌ జియో, సంతోష్‌ మోటార్స్, యాక్సిస్‌ బ్యాంక్, కొటక్‌ బ్యాంక్, మెడ్‌ ప్లస్, ఆదిత్య ఫార్మశీ, ముత్తూట్‌ ఫైనాన్స్, హెటిరో, జెన్యూన్‌ సెక్యూరిటీ సర్వీస్, నోవోటెల్, అరబిందో, ఆయుష్‌ హాస్పిటల్, స్పందన స్ఫూర్తి... తదితర కంపెనీల ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులకు ఇంటర్వ్యూలు చేసి నియామక పత్రాలు అందజేస్తారని పేర్కొన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి పదో తరగతి, ఇంటర్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా చదివి 18-35 ఏళ్ల మధ్య వయసు గల వారు అర్హులని చెప్పారు. విద్యార్హత ధ్రువ పత్రాలు, బయోడేటా, ఆధార్‌ కార్డుతో నేరుగా ఇంటర్వ్యూలకు హాజరుకావాలన్నారు. పూర్తి వివరాలకు 81424 16211 నెంబరులో సంప్రదించాలని సూచించారు. 
 


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.