అనంతపురం ( జేఎన్టీయూ) న్యూస్టుడే: పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు, బీఎస్సీ గణితం పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్, బీఫార్మసీ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఈసెట్-2024 దరఖాస్తులు మార్చి 15 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఏపీ ఈసెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ ఉపకులపతి ఆచార్య శ్రీనివాసరావు, కన్వీనర్ ఆచార్య భానుమూర్తి వెల్లడించారు. జేఎన్టీయూలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉపకులపతి మాట్లాడుతూ.. మార్చి 15 నుంచి ఏప్రిల్ 15 వరకూ ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రూ.500లు అపరాధ రుసుంతో ఏప్రిల్ 22 వరకూ, రూ.2 వేలు అపరాధ రుసుంతో 29 వరకూ, రూ.5 వేలు అపరాధ రుసుంతో మే 2 వరకూ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 8న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మే 10 ప్రాథమిక కీ విడుదల చేసి, 12 వరకూ అభ్యంతరాలు స్వీకరిస్తామన్నారు. అనంతరం ఫలితాలు విడుదల చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 100 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. అగ్రికల్చర్ ఇంజినీరింగ్, బయో టెక్నాలజీ, సెరామిక్ టెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్, కంప్యూటర్ సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఇన్స్ట్రుమెంటేషన్, మెటలర్జికల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు పరీక్షలు జరుగుతాయన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.