ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో రానున్న విద్యా సంవత్సరంలో ఎనిమిది కొత్త వైద్య కళాశాలలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా వైద్య ఆరోగ్య శాఖ చకచకా ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఎనిమిది కాలేజీల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభించేందుకు అవసరమైన కార్యాచరణను రాష్ట్ర వైద్య విద్య సంచాలకులు (డీఎంఈ) చేపట్టారు. గద్వాల, ములుగు, నారాయణపేట, నర్సంపేట, మెదక్, భువనగిరి, కుత్బుల్లాపూర్ (మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా), మహేశ్వరం (రంగారెడ్డి జిల్లా)లో వైద్య కళాశాలలు మంజూరయ్యాయి. వీటితో 400 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా అందుబాటులోకి రానున్నాయి. మొత్తం ఎనిమిది వైద్య కళాశాలలకు అనుమతి కోసం డీఎంఈ.. జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)కి ప్రతిపాదనలు పంపారు. ఇప్పటికే ఈ కళాశాలలకు ప్రిన్సిపాళ్లను నియమించారు. తాజాగా ఎన్ఎంసీ నిబంధనల మేరకు కొత్త వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతోపాటు అనుబంధంగా ఆసుపత్రుల ఏర్పాటు దిశగా చర్యలు చేపట్టారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.