వరంగల్ విద్యావిభాగం, న్యూస్టుడే: ఇంటర్మీడియట్ ఎంపీసీ విద్యార్థులు దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్స్-2024 రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆన్లైన్ విధానంలో జరిగే పరీక్షలకు వరంగల్ నగరంలోనూ నాలుగు కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 8,627 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరు రోజుల పాటు జరిగే పరీక్షల నిర్వహణకు నాలుగు కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ కోఆర్డినేటర్ శ్రీరాముల ఉమారాణి తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
రెండు గంటల ముందే చేరుకోవాలి..
ఆన్లైన్ విధానంలో నిర్వహించే పరీక్షకు రెండు గంటల ముందు నుంచే కేంద్రాల్లోనికి అనుమతిస్తారు. ఉదయం సెషన్ వారికి 8.30, మధ్యాహ్నం సెషన్ వారికి 2.30 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
హాల్టికెట్, అడ్మిట్ కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డుతో హాజరుకావాలి ఎలక్ట్రానిక్ వస్తువులు, బంగారు ఆభరణాలు, చరవాణులు, చేతి గడియారాలను అనుమతించరు.
పరీక్ష కేంద్రం విద్యార్థులు |
వాగ్దేవి ఇంజినీరింగ్ కళాశాల, బొల్లికుంట - 4,000 |
ఆయాన్ డిజిటల్ జోన్, ఎర్రగట్టు గుట్ట-హసన్పర్తి - 2,420 |
నోబుల్ టెక్నాలజీ, సొల్యూషన్స్, చింతగట్టు, భీమారం - 1,870 |
మోక్షిత కంప్యూటర్స్ సెంటర్, రామారం - 337 |
మరింత సమాచారం... మీ కోసం!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ మూడు నెలల్లో గేట్ మొదటి ర్యాంకు
‣ ప్రసిద్ధ సంస్థల్లో బీబీఏ, ఎంబీఏ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.