* కొత్తగా ఒక ఎన్ఐటీ వస్తుందని వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్లో పాల్గొనే విద్యా సంస్థలు ఈసారి మరో ఏడు పెరిగాయి. గత ఏడాది 114 మాత్రమే ఉండగా.. ప్రస్తుతం వాటి సంఖ్య 121కి పెరిగింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతోపాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచిలర్ ఆఫ్ సైన్స్(బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మే 26న జేఈఈ అడ్వాన్స్డ్ నిర్వహించగా.. జూన్ 9న ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ క్రమంలోనే ఐఐటీ మద్రాస్ జూన్ 3న జోసా వెబ్సైట్ను అందుబాటులోకి తెచ్చింది. గత సంవత్సరం 31 ఎన్ఐటీలు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 32కు పెరుగుతుందని పేర్కొంది. దాని పేరు మాత్రం వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థలు 33 నుంచి 39కి పెరిగాయి. 23 ఐఐటీలు, 26 ట్రిపుల్ఐటీల సంఖ్యలో మార్పు లేదు. వాటికి ఐఐఈఎస్టీ సిబ్పుర్(హౌరా వద్ద) అదనం. సీట్ల సంఖ్య, ఇతర వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిగ్రీతో రక్షణ రంగంలో ఉద్యోగాలు!
‣ డేటాసైన్స్తో ఉద్యోగ అవకాశాలు!