దిల్లీ: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ జులై 4న అధికారులతో జరిపిన సమావేశంలో కొత్త సిలబస్ విధానం మేరకు స్కూలు పాఠ్యపుస్తకాల రూపకల్పనపై సమీక్షించారు. ఏప్రిల్ నెల నుంచే బోధించాల్సిన ఆరో తరగతి పాఠ్య పుస్తకాలు ఇంకా మార్కెట్లోకి రాని నేపథ్యలో ఈ సమీక్ష జరిగింది. ఈ విద్యా సంవత్సరం నుంచే 3, 6 తరగతులకు కొత్త పాఠ్యపుస్తకాలు తీసుకొస్తామని ఎన్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మూడో తరగతి పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉండగా, ఆరో తరగతి పుస్తకాల రూపకల్పన తుదిదశకు చేరుకొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ వారం ఆరో తరగతికి చెందిన ఇంగ్లిషు, హిందీ పాఠ్యపుస్తకాలను ఎన్సీఈఆర్టీ విడుదల చేసింది. మిగతా పుస్తకాలు అందుబాటులోకి వచ్చేదాకా బ్రిడ్జి ప్రోగ్రాం బోధించవలసిందిగా సూచనలు జారీ చేశారు. జాతీయ విద్యావిధానం మేరకు 1 నుంచి 12వ తరగతి వరకు కొత్త సిలబస్లో 2026 కల్లా సమగ్ర పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి తీసుకురావాలన్నది ఎన్సీఈఆర్టీ లక్ష్యం. 6వ తరగతి కోసమని ‘పూర్వీ’ పేరుతో రూపొందించిన ఇంగ్లిషు పాఠ్యపుస్తకం చాలా అధ్యయాల్లో భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ మార్పులు చేర్పులు చేశారు. ‘కల్చర్ అండ్ ట్రెడిషన్’ అనే ఛాప్టర్లో ‘ఇండియా’ అనే పదానికి ప్రత్యామ్నాయంగా ‘భారత్’ అని వాడారు. కేంద్ర మంత్రితో జరిగిన సమీక్షలో పాఠశాల విద్య కార్యదర్శి, ఎన్సీఈఆర్టీ సంచాలకుడు, సీబీఎస్ఈ ఛైర్మన్ తదితరులు పాల్గొన్నారు
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరిహద్దు భద్రతా దళంలో ఎస్సై, ఏఎస్సై కొలువులు
‣ వాతావరణ శాస్త్రంతో విభిన్న కెరియర్
‣వాయుసేనలో అత్యున్నత ఉద్యోగాలకు ఏఎఫ్ క్యాట్
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.