వరంగల్, న్యూస్టుడే: కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్ట్స్ కళాశాలలో బీఏ, బీకామ్, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు మే 15న ప్రారంభమయ్యాయి.
పరీక్ష నిర్వహణను ప్రిన్సిపల్ జ్యోతి పరిశీలించారు. ఈ పరీక్షలు జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధ్యాపకులను ఆదేశించారు. ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు ఉదయం 8.30 గంటల వరకు కళాశాలకు చేరుకోవాలని సూచించారు.
ముఖ్యాంశాలు
పరీక్షలు: బీఏ, బీకామ్, బీఎస్సీ మొదటి సంవత్సరం రెండో సెమిస్టర్
తేదీలు: మే 15 నుంచి జూన్ 1 వరకు
కేంద్రం: సుబేదారి ఆర్ట్స్ కళాశాల, వరంగల్
సమయం: ఉదయం 8.30 గంటల నుంచి
Some more information
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.