‣ ఇంటర్ విద్యార్థులకు మే 15 వరకు నిర్వహించాలని నిర్ణయం
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవుల్లో తరగతులు కొనసాగనున్నాయి. వాస్తవంగా మార్చి 30 నుంచి మే 31 వరకు ఇంటర్బోర్డు వేసవి సెలవులు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలన్నీ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. గురుకులాలు మాత్రం మే 16 నుంచి 31 వరకు సెలవులు ఇవ్వాలని నిర్ణయించాయి. మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థులకు.. ప్రస్తుతం నీట్, ఎంసెట్, జేఈఈ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో సమానంగా తరగతులు నిర్వహిస్తామంటూ గురుకుల సొసైటీ ప్రత్యేకాధికారి ప్రతిపాదనలు పంపించారు. ద్వితీయ సంవత్సరం పాఠ్య ప్రణాళికను దసరాలోపు పూర్తిచేసి, జేఈఈ పరీక్షలకు సన్నద్ధం చేయాల్సిన అవసరముందని తెలిపారు. ఈ మేరకు మే 15 వరకు ప్రత్యేక తరగతులకు అనుమతిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. వేసవి సెలవుల్లో పనిచేసిన ఉపాధ్యాయులకు నిబంధనల ప్రకారం ఆర్జిత సెలవులు (ఈఎల్స్) మంజూరు చేస్తామని వెల్లడించారు. అయితే ప్రత్యేక తరగతుల నిర్ణయంపై గురుకుల ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులపై ఒత్తిడి పెంచుతున్నారని, తల్లిదండ్రుల నుంచి బలవంతంగా అంగీకార పత్రాలు తీసుకుంటున్నారని విమర్శించాయి.
ప్రవేశ దరఖాస్తు గడువు పొడిగింపు
ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాలల్లో, 261 బీసీ జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువు ఏప్రిల్ 15 వరకు పొడిగించినట్లు గురుకుల సెట్ కన్వీనర్ బి.సైదులు తెలిపారు. ఏప్రిల్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని వివరించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ భారీ వేతన వరప్రదాయిని.. కోడింగ్
‣ సోషల్ మీడియా ఖాతాల ముఖ్యపాత్ర
‣ మార్కెట్ మందగమనంలో ఉద్యోగ సాధన!
‣ మలిదశ పరీక్షలో గెలుపు వ్యూహం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.