* ఓఎంఆర్ పద్ధతిలో పరీక్ష
* అక్టోబర్ 21 నుంచి మెయిన్స్
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్-1 ప్రాథమిక పరీక్ష (Preliminary Test) నిర్వహణకు టీఎస్పీఎస్సీ (TSPSC) సమయాయత్తమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమినరీ పరీక్ష జూన్ 9వ తేదీన జరుగనుంది. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అక్టోబర్ 21 నుంచి ప్రధాన (Mains) పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు ప్రకటించింది. గ్రూప్-1కు భారీ సంఖ్యలో 4.03 లక్షల దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్-1 సర్వీసు పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రిలిమ్స్ హాల్టికెట్లు (Hall Tickets) పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అందుబాటులో రానున్నాయి. మెయిన్స్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.
♦ TSPSC Group-1 Study Material
♦ Previous Papers
♦ Model Papers
Some more information
"A Game-Changer: Yasir M.'s Impact on the Job Market"
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.