మాచవరం, న్యూస్టుడే : మాచవరంలోని ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువును నవంబరు 26వ తేదీ వరకు పొడిగించినట్లు అధ్యయన కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్ ఎం.అజంతకుమార్ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్సైట్ www.braouonline.in ను గానీ, ఫోన్ 0866-2434868, 73829 29642 నంబర్లలో, అధ్యయన కేంద్రంలో నేరుగా సంప్రదించవచ్చన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.