• facebook
  • whatsapp
  • telegram

26 వరకు దూరవిద్య ప్రవేశాలు

మాచవరం, న్యూస్‌టుడే : మాచవరంలోని ఎస్సారార్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రాంతీయ అధ్యయన కేంద్రం 2020-2021 విద్యా సంవత్సరానికి సంబంధించి డిగ్రీ, పీజీ ప్రవేశాల గడువును న‌వంబ‌రు 26వ తేదీ వరకు పొడిగించినట్లు అధ్యయన కేంద్రం సహాయ సంచాలకుడు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు పొందవచ్చన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www.braouonline.in ను గానీ, ఫోన్‌ 0866-2434868, 73829 29642 నంబర్లలో, అధ్యయన కేంద్రంలో నేరుగా సంప్రదించవచ్చన్నారు.

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.