ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం, మాచవరం: హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో అక్టోబరు 14, 15న జరగాల్సిన అన్ని వార్షిక పరీక్షలను వాయిదా వేసినట్లు విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి దుర్గాప్రసాదరావు తెలిపారు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేద, హోమియో, యునానీ, నాచురోపతి డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయన్నారు. వాయిదా పడిన పరీక్షలను అక్టోబరు 27 తర్వాత నిర్వహిస్తామని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.