• facebook
  • whatsapp
  • telegram

బీకాంలోనే అత్యధిక ‘దోస్త్‌’లు

* ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పెరిగిన ప్రవేశాలు
 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సంప్రదాయ డిగ్రీ కోర్సుల్లో వాణిజ్య శాస్త్రం (బీకాం)పై ఎక్కువ మంది మక్కువ చూపారు. ఈ విద్యా సంవత్సరం(2020-21)లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) ద్వారా మొత్తం 2,12,427 మంది డిగ్రీ కోర్సుల్లో చేరగా వారిలో అత్యధికంగా బీకాంలో 85,691 మంది ప్రవేశాలు పొందారు. ఈ సంవత్సరం కొత్తగా బీకాం బిజినెస్‌ అనలిటిక్స్‌ కోర్సును ప్రవేశపెట్టారు. గత ఏడాది నుంచి బీఎస్‌సీని లైఫ్‌ సైన్స్, ఫిజికల్‌ సైన్స్‌గా విభజించారు. ఆ రెండింటిలో కలిపి 86,642 మంది చేరారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ఏటేటా పెరుగుతున్నాయి. గత ఏడాది ఈ కళాశాలల్లో 42,987 మంది చేరగా.. ఈసారి 45,323 మంది చేరారు. ఈ ఏడాది కొత్తగా కొన్ని పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులకు దోస్త్‌ ద్వారా ప్రవేశాలు కల్పించారు. వాటిల్లో 607 మంది ప్రవేశాలు పొందారు.
 

* కోర్సుల వారీగా చేరిన విద్యార్థుల సంఖ్య
కోర్సు             విద్యార్థుల సంఖ్య
బీకాం              85,691
బీఎస్సీ ఫిజికల్‌ సైన్స్‌   45,180
బీఎస్సీ లైఫ్‌ సైన్స్‌     41,462
బీఏ               31,179
బీసీఏ              1010
బీబీఏ              6,944
బీబీఎం             204
బీఎస్‌డబ్ల్యూ          45
బీహోక్‌(ఒకేషనల్‌)     107
డిప్లొమా            607
మొత్తం           2,12,427
 

సామాజికవర్గాల వారీగా...
ఓసీ         39,619
ఎస్‌సీ        34,447
ఎస్‌టీ        18,540
బీసీ-ఎ        18,594
బీసీ-బి        39,072
బీసీ-సి         519
బీసీ-డి        47,888
బీసీ-ఇ        13,748
మొత్తం       2,12,427
 

విశ్వవిద్యాలయాల వారీగా...
వర్సిటీ          విద్యార్థుల సంఖ్య
కేయూ          56,073
మహాత్మాగాంధీ    15,120
ఓయూ          81,448
పాలమూరు       16,670
శాతవాహన       26,027
తెలంగాణ        16,484
పాలిటెక్నిక్‌ కోర్సులు   607
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-12-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.