విద్యా ఉద్యోగ సమాచారం

  • facebook
  • whatsapp
  • telegram

పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ 

మలక్‌పేట, న్యూస్‌టుడే: ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేద అభ్యర్థులకు దిల్‌సుఖ్‌నగర్‌లోని విజేత స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు డైరెక్టర్‌ వి.జె.రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టెట్‌-1,2, ఎస్‌జీటీ, ఎస్‌.ఏ, టీజీటీ, పీజీటీ, ఎస్సై, పోలీస్‌ కానిస్టేబుల్‌ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని, తెలుగు మీడియంలో చదివిన వారు కూడా అర్హులని పేర్కొన్నారు. తెల్లరేషన్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రం లేదా వార్షిక ఆదాయం రూ.2లక్షలలోపు ఉన్న అభ్యర్థులు నేరుగా స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో రెండు పాస్‌పోర్టు ఫొటోలతో ఫిబ్రవరి 1లోపు పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. మూడు నెలల పాటు శిక్షణ తరగతులు, పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. మరిన్ని వివరాలకు దిల్‌సుఖ్‌నగర్‌ బస్టాండ్, మెట్రో పిల్లర్‌ ఏ1531 ఎదురుగా ఉన్న స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో, చరవాణి సంఖ్య 99084 80999, 99084 70999లో సంప్రదించాలని కోరారు.

Published at : 20-01-2021 11:14:41

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం