‣ కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్లో ప్రకటన
దిల్లీ: విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న సీబీఎస్ఈ 10, 12 తరగతుల పరీక్షల పూర్తి షెడ్యూల్ విడుదలైంది. మే 4 నుంచి జూన్ 11 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ట్విటర్లో ప్రకటించారు. పదో తరగతి పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరగనున్నాయి. అలాగే 12వ తరగతి పరీక్షలు రెండు షిఫ్ట్లలో కొనసాగుతాయి. తొలి షిఫ్ట్ ఉదయం 10.30 గంటల నుంచి 1.30 గంటల వరకు; రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు జరగనున్నాయి. ఏటా ప్రాక్టికల్ పరీక్షలు జనవరిలో.. రాత పరీక్షలు ఫిబ్రవరిలో మొదలై మార్చిలో ముగిసేవి. కానీ కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల నిర్వహణలో జాప్యం నెలకొంది. 2021లో బోర్డు పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించబోమని ఇప్పటికే సీబీఎస్ఈ బోర్డు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.