* ఆర్సీ, ప్రిన్సిపాళ్లకు మార్గదర్శకాలు జారీ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, సాధారణ గురుకులాల ప్రారంభానికి సంక్షేమ గురుకులాల సొసైటీలు మార్గదర్శకాలు జారీచేశాయి. తొమ్మిది ఆపై తరగతుల విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించాయి. నాణ్యమైన ఆహారం, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచాలని తెలిపాయి. తరగతి గదులను రోజూ శానిటైజ్ చేయాలని, అవసరమైన మరమ్మతులు పూర్తిచేసి జనవరి 25 నాటికి గురుకులాల్ని సిద్ధం చేయాలని పేర్కొన్నాయి. ఈ మేరకు సంక్షేమ గురుకులాల ప్రాంతీయ సమన్వయకర్తలు, గురుకులాల ప్రిన్సిపాళ్లకు ఆదేశాలు జారీచేశాయి. పిల్లలు తరగతులకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని స్పష్టం చేశాయి.
స్థానిక భాషల్లో హామీపత్రాలు
ఏజెన్సీ గిరిజన పాఠశాలల్లో చదువుతున్న 9, 10 విద్యార్థులు తల్లిదండ్రుల నుంచి హామీ పత్రాల కోసం తెలుగు, ఆంగ్లంతోపాటు స్థానిక నాలుగు ఆదివాసీ భాషల్లోనూ పత్రాలు సిద్ధం చేసింది. తల్లిదండ్రులకు అర్థమయ్యేందుకు ఈ భాషల్లో ముద్రించినట్లు గిరిజన సంక్షేమ శాఖ అధికారులు వెల్లడించారు. ఏజెన్సీ పాఠశాలల్లో విద్యార్థులకు సరిపడా గదులు లేకుంటే వారిని తరగతులు జరగని ఇతర ప్రభుత్వ పాఠశాలల్లో సర్దుబాటు చేయాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.