• facebook
  • twitter
  • whatsapp
  • telegram

VIDYADHAN: పేద విద్యార్థులకు ‘విద్యాధన్’ ఉపకారవేతనాలు 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్మీడయట్‌ చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాధన్ పేరిట ‘సరోజిని దామోదరన్‌ ఫౌండేషన్‌’ ఉపకారవేతనాలు అందజేస్తోంది. ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున స్కాలర్‌షిప్‌ ఇవ్వనుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జూన్‌ 7వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9663517131 అనే నంబరుకు ఫోన్‌ చేయవచ్చు.

వివరాలు...

విద్యాధన్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2024

అర్హత: కనీసం 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.

స్కాలర్‌షిప్: ఇంటర్‌లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రెండేళ్లకు మొత్తం రూ.20 వేల స్కాలర్‌షిప్‌ అందుతుంది.

ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ముఖ్య తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-06-2024.

స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 23-06-2024.

ఇంటర్వ్యూ/ పరీక్షల తేదీలు: 07 నుంచి 20-07-2024 వరకు.



 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దా రి



 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 30-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి