ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 విద్యా సంవత్సరం పదో తరగతిలో 90 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఇంటర్మీడయట్ చదువుతున్న పేద విద్యార్థులకు విద్యాధన్ పేరిట ‘సరోజిని దామోదరన్ ఫౌండేషన్’ ఉపకారవేతనాలు అందజేస్తోంది. ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున స్కాలర్షిప్ ఇవ్వనుంది. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి. ఆసక్తి ఉన్నవారు జూన్ 7వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలకు 9663517131 అనే నంబరుకు ఫోన్ చేయవచ్చు.
వివరాలు...
విద్యాధన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024
అర్హత: కనీసం 90 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థుల కుటుంబ ఆదాయం ఏడాదికి రూ.2 లక్షలలోపు ఉండాలి.
స్కాలర్షిప్: ఇంటర్లో ఒక్కో విద్యార్థికి ఏడాదికి రూ.10 వేల చొప్పున రెండేళ్లకు మొత్తం రూ.20 వేల స్కాలర్షిప్ అందుతుంది.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-06-2024.
స్క్రీనింగ్ టెస్ట్ తేదీ: 23-06-2024.
ఇంటర్వ్యూ/ పరీక్షల తేదీలు: 07 నుంచి 20-07-2024 వరకు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ ఆఫర్ లెటర్ అందుకుంటే సరిపోదు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
NTR Trust: ఎన్టీఆర్ జీఈఎస్టీ (గర్ల్స్ ఎడ్యుకేషన్ స్కాలర్షిప్ టెస్ట్)-2024