* అనాథ బాలబాలికలకు ఉచిత విద్యనందిస్తున్న సంస్థ
ఈనాడు, అమరావతి: అమ్మా నాన్నల ఒడికి దూరమైన చిన్నారులకు విద్యాబుద్ధులు నేర్పే నైస్ (నీడీ ఇల్లిటరేట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్) విద్యా సంస్థలో వచ్చే ఏడాది 5, 6 తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం కనపర్రు పంచాయతీ మైనంపాడులో ఉన్న ఈ సంస్థలో ప్రవేశం పొందిన చిన్నారులకు ఉచిత విద్యా బోధన, భోజన వసతి కల్పించి పుస్తకాలు, దుస్తులు కూడా అందజేస్తారు. అర్హులైన విద్యార్థులకు ఏప్రిల్ 7న ఉదయం 10.30 - 12.30 గంటల మధ్య పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. దరఖాస్తులను పరీక్ష తేదీ వరకు స్వీకరిస్తారు. తల్లిదండ్రుల / తల్లి లేదా తండ్రి మరణ ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు తీసుకురావాలి. పూర్తి వివరాలను నైస్ సంస్థకు విచ్చేసి గానీ, 6300864626, 8985189232 ఫోన్ నంబర్లలో సంప్రదించి కానీ తెలుసుకోవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!
‣ ఆఫర్ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.