• facebook
  • whatsapp
  • telegram

AEE posts: 18 నుంచి ఏఈఈ పోస్టులకు ధ్రువీకరణ పత్రాల పరిశీలన 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 1540 అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ (ఏఈఈ) పోస్టుల భర్తీకి మార్చి  18 నుంచి 22 వరకు టీఎస్‌పీఎస్సీ ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయనుంది. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్‌ ప్రకటించింది. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని జేఎన్‌టీయూ అడ్మిషన్‌ బ్లాక్‌లో ఈ పరిశీలన జరుగుతుందని వెల్లడించింది. ఆయా అభ్యర్థులు చెక్‌లిస్టులోని పత్రాలన్నీ తీసుకురావాలని సూచించింది. పరిశీలన సమయంలో ఒరిజినల్‌ ధ్రువీకరణ పత్రాలు సమర్పించకుంటే.. వారికి తదుపరి సమయం ఇవ్వబోమని, షెడ్యూలు తేదీలో గైర్హాజరైన వారికి సైతం మళ్లీ అవకాశం ఉండబోదని కమిషన్‌ తెలిపింది.

వివిధ ప్రభుత్వ ఇంజినీరింగ్‌ విభాగాల్లో 1540 ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, మెకానికల్‌, సివిల్‌, అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ పోస్టులకు 2022 సెప్టెంబరులో టీఎస్‌పీఎస్సీ ప్రకటన జారీచేసింది. ఈ పోస్టులకు 81 వేల మంది దరఖాస్తు చేయగా.. తొలుత 2023 జనవరి 22న రాతపరీక్ష జరిగింది. పశ్నపత్రాల లీకేజీ కారణంగా ఈ పరీక్షను రద్దుచేసిన కమిషన్‌ 2023 మే 8, 9, 21, 22 తేదీల్లో సీబీఆర్‌టీ పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షల్లో సబ్జెక్టుల వారీగా మెరిట్‌ జాబితాలను గతేడాది సెప్టెంబరులో ప్రకటించింది. తాజాగా 1:2 నిష్పత్తిలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన మార్చి 18 నుంచి జరగనుంది.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ కొత్త అవకాశాలకు.. ఆన్‌లైన్‌ టీచింగ్‌!

‣ ఆశయ సాధనకు అలుపెరుగని కృషి!

‣ ఆస్ట్రోఫిజిక్స్‌తో అపార అవకాశాలు!

‣ జనరల్‌ డిగ్రీతో జాబ్‌ సాధ్యమే!

‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!

‣ విదేశీ కొలువు కల.. సాకారం ఇలా!

‣ ఆఫర్‌ అందాక.. ఆరు సూత్రాల ప్రణాళిక!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.