దిల్లీ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో.. మే నెలలో జరగాల్సిన చార్టర్డ్ ఎకౌంటెన్సీకి సంబంధించిన కొన్ని పరీక్షలను వాయిదా వేయాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యా (పిల్)న్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. పోలింగ్ రోజున ఏ పరీక్షనూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ ఎకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) నిర్వహించడం లేదని పేర్కొంది. తేదీలను మార్చడం వల్ల పరీక్ష నిర్వహణకు ఇప్పటికే చేసిన ఏర్పాట్లకు విఘాతం కలుగుతుందని, ఎంతోమంది విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిప్రాయపడింది. పరీక్షల షెడ్యూల్ అనేది ‘విధానపరమైన నిర్ణయాల’కు సంబంధించిన అంశమని పేర్కొంది. సీఏ పరీక్షలు మే 2 నుంచి మే 17వరకు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా 591 కేంద్రాల్లో వీటిని నిర్వహిస్తున్నారు. 4లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షల కోసం నమోదు చేసుకున్నారు. మే 7, 13న పలు రాష్ట్రాల్లో పోలింగ్ జరగనున్నందున మే 8, 14న జరగనున్న పరీక్షలను వాయిదా వేయాలని కోరుతూ పిల్ దాఖలైంది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కోచింగ్ లేదు... డెయిలీ టార్గెట్స్ పూర్తీచేశా!
‣ టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.