ఈనాడు, హైదరాబాద్: పలు కారణాలతో శిక్షణకు హాజరుకాని కానిస్టేబుల్ అభ్యర్థులకు జులై 22 నుంచి మరోమారు అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ (శిక్షణ) అభిలాష్ బిస్త్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి సివిల్, ఏఆర్, రాష్ట్ర ప్రత్యేక పోలీసు పటాలం (టీజీఎస్పీ) విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో శిక్షణ కూడా ప్రారంభించారు. అయితే పలువురు కానిస్టేబుల్ అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల ఈ శిక్షణకు హాజరుకాలేదు. వీరికి జులై 22 నుంచి తొమ్మిది నెలలు పాటు శిక్షణ ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఆమె కోరారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు!
‣ హెచ్సీఎల్లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.