అంగలూరు (గుడ్లవల్లేరు), న్యూస్టుడే: అంగలూరులోని జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్) ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులకు ఏప్రిల్లో రెండు పూటలా పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఒక రోజు ప్రథమ సంవత్సరం, రెండో రోజు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అందుకు భిన్నంగా ఒకే రోజు ఉదయం, సాయంత్రం నిర్వహిస్తున్నారు. దీని వల్ల ఆయా సబ్జెక్ట్లు తప్పినవారు ఒకేరోజు రెండు వేర్వేరు సెమ్ పరీక్షలు రాయాల్సి వస్తోంది. డీఎడ్ పరీక్షలు గత అయిదేళ్లుగా ఇష్టానుసారంగా నిర్వహిస్తుండడంతో విద్యార్థులు దీనిపై ఆసక్తి చూపడం లేదు. 2022-24 ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు మూడో సెమ్ ఏప్రిల్ 22 నుంచి 27 వరకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 2023-25 ప్రథమ సంవత్సరం విద్యార్థులకు మొదటి సెమ్ ఏప్రిల్ 22 నుంచి 27 వరకు మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు డి.దేవానంద్రెడ్డి ఆదేశాలు జారీ చేశారని ప్రిన్సిపల్ కె.లక్ష్మీనారాయణ తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీఐ ఉంటే రైల్వే టెక్నీషియన్ కావచ్చు !
‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం
‣ స్కామర్లతో తస్మాత్ జాగ్రత్త!
‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్ ఆవాసాలు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.