ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ‘కీ’లను ప్రకటించిన ప్రభుత్వం ఫలితాలను విడుదల చేయకపోవడంతో అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. డీఎస్సీ షెడ్యూల్ ప్రకటించినందున టెట్ మార్కులు కీలకం కానున్నాయి. డీఎస్సీలో టెట్ మార్కులకు 20శాతం వెయిటేజీ ఉంటుంది. టెట్లో అర్హత సాధిస్తే డీఎస్సీకి అర్హులవుతారు. మొదట ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 14న ఫలితాలు విడుదల చేయాల్సి ఉండగా.. ఇంతవరకు దీనిపై స్పష్టత లేదు. టెట్ను ఆన్లైన్లో నిర్వహించినందున నార్మలైజేషన్ చేయాల్సి ఉంటుంది. టెట్ అందరికీ ఒకేసారి కాకుండా విడతల వారీగా నిర్వహించారు. దీంతో ఒకసారి ప్రశ్నపత్రం కఠినంగా.. మరోసారి తేలికగా రావొచ్చు. దీంతో మార్కులను నార్మలైజేషన్ చేస్తారు. మార్కుల్లో కొంత వ్యత్యాసం వస్తుంది. ప్రభుత్వం టెట్ మార్కులు ఇవ్వనందున డీఎస్సీ సన్నద్ధతపై అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో డీఎస్సీ షెడ్యూల్ను ప్రభుత్వం మార్చింది. మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు నిర్వహించనున్నారు. మార్చి 20 నుంచి పరీక్ష కేంద్రాల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించనున్నారు. 25నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు
మరింత సమాచారం... మీ కోసం!
‣ కొత్త అవకాశాలకు.. ఆన్లైన్ టీచింగ్!
‣ ఆస్ట్రోఫిజిక్స్తో అపార అవకాశాలు!
‣ జనరల్ డిగ్రీతో జాబ్ సాధ్యమే!
‣ గురుకుల కొలువుల్లో ఆదరగొట్టారు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.