* ఐటీ శాఖ ఆధ్వర్యంలో 10న నిర్వహణ
ఈనాడు, హైదరాబాద్: తెలుగులో చాట్ జీపీటీ తయారీకి అవసరమైన తెలుగు భాష డేటా సెట్స్ సమీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం, స్వేచ్ఛ సంస్థలు సంయుక్తంగా జులై 10న డేటాథాన్ సదస్సు నిర్వహించనున్నట్లు ఐటీ శాఖ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్లో జరగనున్న అంతర్జాతీయ ఏఐ సదస్సులో భాగంగా డేటాథాన్ ఉంటుందని పేర్కొంది. తెలంగాణ ఎమర్జింగ్ టెక్నాలజీ వింగ్, టాస్క్, ఐఐఐటీహెచ్, వైల్ఓజోన్టెల్, డిజిక్వాంట, టెక్వేదిక సంస్థలు సహకరించనున్నాయని, 10న రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల విద్యార్థులు డేటాథాన్లో పాల్గొంటారని వివరించింది. తెలుగు భాష, సంస్కృతి వనరులను డేటాథాన్ సదస్సు ద్వారా సమీకరించి ఆ సమాచారాన్ని ఐటీశాఖతో కలిసి డిజిటైజ్ చేయనున్నారు. సదస్సులో పాల్గొనే విద్యార్థులు, పౌరులు జానపదాలు, పాటలు, స్థానిక ప్రాంతాల చరిత్ర, సంస్కృతి, ఆహారంపై సమాచారం తీసుకుంటారు. దీని ద్వారా ఇంజినీరింగ్ విద్యార్థులకు డేటా సమీకరణ, ప్రాసెసింగ్, ఏఐ టెక్నాలజీ అప్లికేషన్ల వినియోగంపై నైపుణ్యాలు పెరుగుతాయని ఐటీ శాఖ వెల్లడించింది. ఈ సమాచార సేకరణకు స్వేచ్ఛ సంస్థ తరపున ఆండ్రాయిడ్ ఆధారిత యాప్ తీసుకువచ్చామని స్వేచ్ఛ ప్రతినిధి ప్రవీణ్, కిరణ్చంద్ర తెలిపారు. ఈ యాప్లో మాట్లాడిన విషయాలు టెక్ట్స్ రూపంలో నిక్షిప్తమవుతాయన్నారు. తెలుగులో చాట్ జీపీటీ ప్రయత్నంలో భాగంగా తాము ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నామని ప్రకటించారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్రంలో 8326 మల్టీ టాస్కింగ్ ఉద్యోగాలు!
‣ హెచ్సీఎల్లో జూనియర్ మేనేజర్లు!
‣ క్లర్క్ కొలువు సాధనతో సులువు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.