ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో మే 20న ప్రారంభమైన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) పేపర్-2 గణితం, సైన్స్కు తొలిరోజు కేవలం 77.81 శాతం మంది హాజరయ్యారు. మొత్తం 34,436 మందికి 26,796 మంది పరీక్ష రాశారు. సొంత జిల్లాల్లో కాకుండా దూరంగా ఉన్న ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు ఇవ్వడంతో 22 శాతం మంది పరీక్షకు హాజరు కాలేదు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం కొన్ని పరీక్షా కేంద్రాలను సందర్శించారు. పేపర్-2 గణితం, సైన్స్ పేపర్ తొలిరోజు మధ్యస్తంగా ఉన్నట్లు అభ్యర్థులు తెలిపారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతికూల ఆలోచనలను ప్రతిఘటిద్దాం!
‣ టెక్స్టైల్ కమిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ కొలువులు!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఫార్మసీ కోర్సులు!